సూర్యాపేట జిల్లాలో ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలుసా..?

by Naveena |
సూర్యాపేట జిల్లాలో ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలుసా..?
X

దిశ,సూర్యాపేట : జిల్లాలో 2530 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట ఆనంద విద్య నిలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళని అయన పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ..ఏవీయం పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లకు గాను 935 ఓట్లు పోలయ్యాయని, పురుషులు 548, స్త్రీలు 387 ఓట్లు వినియోగించుకున్నారని అన్నారు. జిల్లాలో 2664 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని ,ఉదయం 08:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు 2530 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, డిఎస్పి రవి, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed