- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు : మునుగోడు ఎమ్మెల్యే

దిశ, చౌటుప్పల్ : ప్రజలకు అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించబోమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామర గ్రామంలోని 26 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించగా అప్పటికే భవన గోడలు బీటలు పారడంతో కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం చేపట్టి సంవత్సర కాలంలోనే బీటలు పారడం ఏంటని కాంట్రాక్టర్ ని ప్రశ్నించారు.
తక్షణమే రెనోవేషన్ చేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలని ఆదేశించారు. అనంతరం 3.25 కోట్ల రూపాయల నిధులతో చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, మాజీ చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.