- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
న్యాయ సహాయం, హక్కులు కల్పించడమే డీఎల్ఎస్ఏ లక్ష్యం
by Naresh |

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్: ప్రతి ఒక్కరికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం హక్కులు కల్పించడమే డీఎల్ఎస్ఏ లక్ష్యమని డీఎల్ఎస్ఏ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజ్ అన్నారు. మార్చ్ 9న నిర్వహించబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో శనివారం జిల్లా కోర్టులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 11,833 రాజీ పడటానికి అవకాశం ఉన్న క్రిమినల్, సివిల్ కేసులను గుర్తించామన్నారు. లోక్ అదాలత్ సేవలను విస్తృత పరిచేందుకు కృషి చేయాలని తెలిపారు. అందులో భాగంగా ప్రజలకు న్యాయమైన చట్టాల గురించి అవగాహన కల్పిస్తూనే సంస్థ ద్వారా కలిగించే సేవలను తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు మారుతి దేవి, దశరథ రామయ్య పాల్గొన్నారు.
Next Story