- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది తొలగింపు.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం

దిశ, నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జీతాలు సరిగా రావడం లేదని, వచ్చినా అవి ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయా సంస్థల అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే విషయంలో వెంటనే స్పందించిన మంత్రి జీవో నెం.60 ప్రకారం వారి జీతాలను వెంటనే పెంచాలని అప్పటి సూపరింటెండెంట్ లచ్చునాయక్కు పలు అవుట సోర్సింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. అయినా.. సాయి ఏజెన్సీ వారు మంత్రి ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయడం లేదు. అంతే కాకుండా ఎవరైతే తమ ఏజెన్సీపై మంత్రి ఫిర్యాదు చేశారో వారిని విధుల నుంచి నిర్దాక్షిన్యంగా తొలగించారు. అసలు రికార్డులలో వారి పేరు లేకుండా చేశారు.
మంత్రి మనుషులమనే అక్కసు..
నాగమణి, జానకి, లలిత అనే ముగ్గురు శానిటేషన్ సిబ్బందికి నాయకత్వ లక్షణాలు ఉండటంతోనే వారు తమకు అన్యాయం జరగడంతో ఏజెన్సీకి ఎదురు తిరిగారు. అలాగే వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వర్గానికి చెందినవారు అవ్వడంతో వారిని విధుల నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు మిగతా సిబ్బందితో మూకుమ్మడిగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం పేషంట్ కేర్, శానిటేషన్ వర్కర్లు మాట్లాడుతూ.. తమకు ఎదైనా అవసరం ఉండి లీవ్ కావాలనుకుంటే ఎజెన్సీ యజమాని ఇంటికి వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఒకవేళ అనుకోకుండా ఓ రెండు రోజులు మూడు రోజులు రాలేని పరిస్థితి ఉంటే జీతాలలో ఎక్కువ శాతం కట్ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఇచ్చే పీఎఫ్లలో కూడా చాలా తేడా ఉందని జీవో 60ను ఏమాత్రం పాటించకుండానే జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇదేంటని సిబ్బంది ప్రశ్నిస్తే.. యాజమాన్యం బెదిరింపులకు గురిచేస్తూ పని చేయించుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో తొలగించిన వ్యక్తి విధుల్లోకి తీసుకోవాలని మంత్రి చేత ఒత్తిడి తెచ్చినందుకే నాగమణి, జానకి, లలిత అనే సిబ్బందిపై ఏజెన్సీ విధుల నుంచి తొలగించిందని తెలిపారు.
ముగ్గురు సిబ్బంది ఆత్మహత్యాయత్నం..
తమను ఉద్యోగం నుంచి తొలగించారనే సమాచారం వినగానే సిబ్బంది నాగమణి, జానకి, లలిత గుర్తు తెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తించిన తోటి సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఇవాళ రెండు గంటలు ఆందోళన చేస్తున్నా.. ఎవరూ పట్టింకోకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా బాధితులు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నత వైద్యాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.