నిఖార్సైన వార్తలకు దిశ బ్రాండ్ అంబాసిడర్

by Naveena |
నిఖార్సైన వార్తలకు దిశ బ్రాండ్ అంబాసిడర్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రాష్ట్రంలో నిఖార్సైన వార్తలను ప్రచురించడంలో దిశ తెలుగు దినపత్రిక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందని జిల్లా కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో దిశ దినపత్రిక క్యాలెండర్ ను అడిషనల్ కలెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దిశ దినపత్రిక ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తుందన్నారు. నిజాయితీగా, పారదర్శకంగా వార్తలు రాస్తూ ప్రజల మన్ననలు పొందిందన్నారు. దిశ పత్రిక మున్ముందు మంచి వార్తలు అందించి పత్రిక ప్రతిష్టను పెంపొందించుకోవాలన్నారు. పరిశోధనాత్మక వార్తలు రాయడంలో దిశ తనదైన ముద్ర వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గంగాధర్, భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, దిశ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంటన్నగారి మహేష్, రిపోర్టర్లు గుండె బాబు, చిల్వేరు సంజీవ, వంశి, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.నిఖార్సైన వార్తలకు దిశ బ్రాండ్ అంబాసిడర్...



Next Story

Most Viewed