దిశ ఎఫెక్ట్...రోడ్డు విస్తరణకు సర్వే..

by Kalyani |
దిశ ఎఫెక్ట్...రోడ్డు విస్తరణకు సర్వే..
X

దిశ, నడిగూడెం: మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు అనుసంధానించే రహదారుల సైడ్ మార్జిన్ రోజురోజు ఆక్రమణకు గురవుతుండగా ఆయా రహదారుల్లో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులను తెలుపుతూ " ఇరుకు రోడ్లపై ఇక్కట్లు" అనే శీర్షికన దిశ శనివారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సింగిల్ లైన్ రోడ్డుగా ఉన్న రహదారిని డబుల్ లైన్ (30 అడుగుల వెడల్పు) రహదారిగా విస్తరణలో భాగంగా ఆదివారం మండలంలోని కాగిత రామచంద్రపురం లో సర్వే నిర్వహించారు. నడిగూడెం వయా కే ఆర్సీ పురం మీదుగా ఖమ్మం జిల్లాకు కలిపేందుకు సుమారు రూ. 20 కోట్ల నిధులతో 9.5 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు.



Next Story