- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్...చెరువును పరిశీలించిన అధికారులు

దిశ ,మర్రిగూడ : చెరువు ధ్వంసం, లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ము మట్టిపాలు, ఆయకట్టు రైతులు గగ్గోలు...భూస్వామి కుటుంబ సభ్యుల నిర్వాకం అనే కథనంపై బుధవారం అధికారులు స్పందించారు. మర్రిగూడ తహసీల్దార్ ఆధ్వర్యంలో బుధవారం అధికారులు తానేదార్ పల్లిలో ధ్వంసమైన చెరువును పర్యవేక్షించారు. ఆయకట్టు రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చెరువు ఎప్పుడు నిర్మించారు, ఏ నిధుల నుంచి నిర్మించారు, ఎంతమంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది... ధ్వంసం చేసిన భూస్వామి ఎవరు అనే వివరాలను సేకరించారు. చెరువు ధ్వంసం చేసిన దానిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి చెరువు కట్ట పునర్మించి రైతులకు మేలు చేస్తామని దిశకు తెలిపారు. చెరువు కట్ట పునర్మించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ బషీర్, ఇరిగేషన్ ఏఈ తదితరులు ఉన్నారు.