భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: ఈవో

by Kalyani |
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: ఈవో
X

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కావాలో భక్తులని ఆలయ ఈవో అడిగి తెలుసుకున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులతో మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం సాఫీగా అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని భక్తులకు చెప్పారు. పారిశుద్ధ, తాగునీరు, టాయిలెట్ల సమస్యలు వేసవిలో కొండ పైన చేయవలసిన ఏర్పాట్లపై భక్తులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు.. అలాగే ఈవో ప్రసాదాల విక్రయాల తయారీ కేంద్రం వద్దకు వెళ్లి తయారు విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, సీసీ నాగేష్, తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed