అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి

by Naveena |
అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
X

దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టాక్స్ కలెక్షన్ ఇప్పటివరకు ఎంత జరిగిందని,టాక్స్ కలెక్షన్ డిమాండ్ సమయానికి నోటీసులు జారీ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వార్డ్ ఆఫీసర్ లు ప్రతిరోజు ఎంత టాక్స్ కలెక్షన్ చేస్తున్నారని, కలక్షన్ చేసిన డబ్బును బ్యాంకులో జమ చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉందా లేదా అని తెలుసుకున్నారు.

ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్త వేరు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీలోని నర్సరీలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు,నర్సరీ టార్గెట్ ఎంత అని అడిగి తెలుసుకున్నారు. టియుఎఫ్ఐడిసి పనులకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయన్నారు. ఎస్ ఈ పబ్లిక్ హెల్త్ తో ఫోన్ లో మాట్లాడి వెంటనే రీటెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండిఏ కి సంబంధించిన లె ఔట్స్ ,రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలని సిబ్బందికి సూచించారు. మున్సిపాలిటి పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ ,గ్రీన్ బడ్జెట్ సరిపడ ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉండకుండా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ , బిల్డింగ్ పర్మిషన్స్ త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం వార్డులలో శానిటేషన్ తప్పకుండా చేయాలని,వార్డులన్ని పరిశుభ్రంగా ఉంచాలని ,సిబ్బంది అందరు కూడా వార్డు లలో ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్ రెడ్డి, ఇన్చార్జి తహసిల్దార్ నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.



Next Story