- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు...అదే నీటిని తాగుతున్న ప్రజలు
![నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు...అదే నీటిని తాగుతున్న ప్రజలు నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు...అదే నీటిని తాగుతున్న ప్రజలు](https://www.dishadaily.com/h-upload/2024/04/03/323738-kotulu.webp)
దిశ, నాగార్జునసాగర్ :నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు కుళ్లిపోగా అదే నీటిని ప్రజలు తాగుతున్న ఘటన సాగర్లో చోటు చేసుకుంది. నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ లో వానరాల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నీటి సరఫరా అవుతున్న అదే కలుషిత నీటిని వార్డు ప్రజలు తాగుతున్నారు.
వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందాయి. సుమారు 30 కోతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడం కలకలం రేపింది. అయినా నీటి సరఫరా సిబ్బంది కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ట్యాంక్ శుద్ది చేయడం మరిచారా.. ప్రజల ఆరోగ్యాలతో చేలగాటమాడుతున్నారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు,సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.