- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మా ఇంటికి పోయేందుకు దారేదీ.. ఓ దళితుడి ఆవేదన..

దిశ, చండూరు : తన ఇంటికి వెళ్లే దారిని కొందరు మూసివేసి తనను, తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారంటు గట్టుప్పల మండలం నామపురం గ్రామానికి చెందిన దళితుడు భీమనపల్లి మారయ్య ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం గ్రామంలో భూమి కోనుగోలు చేసుకోని ఆ భూమిలో ఇల్లు కట్టకొని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొందరు గ్రామస్తులు ఈ దారితో ఎలాంటి సంబంధం లేని భీమనపల్లి నరేష్ తండ్రి నర్సింహా, భీమనపల్లి లింగయ్య, భీమనపల్లి యాదయ్య లు అక్రమంగా దారిలో రాతి కడ్డీలు నాటి ఇంటికి పోకుండా చేశారని తెలిపారు. దీనిపై ఈ నెల 22 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గత ఎనిమిది రోజులుగా ఇంటికి పోయే దారికి మూసివేసి అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే సీఐకి కూడా ఫిర్యాదు చేసానని అధికారులు వచ్చి చూసి పోయారు గాని దౌర్జన్యానికి పాల్పడిన వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఏ సంబంధం లేని వ్యక్తులు అక్రమంగా నా దారికి అడ్డు వచ్చి నన్ను నా కుటుంబాన్ని దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ చంపుతామని బెదిరిస్తున్న వారి పై చట్టరీత్యా చర్య తీసుకుని నా దారికి వేసిన రాతికడీలను పెన్సింగ్ తొలగించి మమ్ముల్ని సాధారణ జీవనం గడిపే విధంగా సహకరించాలని అధికారులను డిమాండు చేస్తున్నారు. కాగా దారికి అడ్డంగా నాటిన పెన్సింగ్ ను పరిశీలించి వెళ్లిన ఎస్ఐ, తహశీల్దార్ లు దానిని తొలగించడానికి చర్యలు తీసుకోకపోగా వచ్చే నెల 4 వ తేదీన సర్వే చేయిస్తామని అంటున్నారు. దీంతో అప్పటి వరకు ఇంటికి పోవటానికి ఇబ్బందులు తప్పేలా లేవని ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని పెన్సింగ్ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.