నల్లగొండ కలెక్టరేట్‌లో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 23 |
నల్లగొండ కలెక్టరేట్‌లో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ,నల్లగొండ: నల్గొండ కలెక్టర్ కార్యాలయం లో ఒక మహిళ బట్టు సునీత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.వివరాల్లోకి వెళితే బట్టు సునీత భర్త బట్టు రవి గత కొన్ని సంవత్సరాలుగా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ లో పెట్రోల్ బంక్ పక్కన వినాయకుడు విగ్రహం తయారు చేస్తారు.బట్టు సునీత ను కొందరు వ్యక్తులు నన్ను మీకు పెట్టుబడి పెడుతాం వడ్డీ లేకుండా అని అవసరానికి తన వద్దకు రావాలని నీ బిడ్డ నువ్వు కలిసి వ్యభిచారం చేయండి అని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని వారి మీద మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జనవరి 22వ తేదీన ఫిర్యాదు చేసాను ఆ తరువాత పోలీస్ స్టేషన్ కి తిరిగిన వారు పట్టించుకోలేదు అని విగ్రహాలు తయారు చేసే స్థలానికి వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారు అని తట్టుకోలేక నేను చనిపోతున్న అని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా అక్కడి వారు అడ్డుకోవడం జరిగింది.



Next Story

Most Viewed