ఇకపై డైలీ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు : నల్లగొండ ఎస్పీ

by Aamani |
ఇకపై డైలీ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు : నల్లగొండ ఎస్పీ
X

దిశ,నల్లగొండ క్రైమ్: ఇకపై ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ డీపీవోలో పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, త్వరిగతిగా పరిష్కరిస్తూ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీతో పారదర్శకంగా చేయాలని అన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకూ ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు.

ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీటీవీలు ఏర్పాటుకు కృషి చేయాలని, నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామలలో, ప్రధాన కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

హైవేలు, ప్రధాన కూడళ్లలో, పార్కింగ్ ప్రాంతాలలో, పెట్రోల్ పంపులు, దాబాల ఎంట్రీ, ఎగ్జిట్ లలో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేల సంభందిత యజమానులకు తెలియజేయాలని సూచించారు. వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, అక్రమ ఇసుక రేషన్ బియ్యం రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకొని నియంత్రించాలని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, ఎస్బీ డీఎస్పీ రమేష్, డీటీసీ డీఎస్పీ విఠల్ రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, డీసీఆర్బీ డీఎస్పీ సైదా, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed