పంట పొలాల్లో మొసలి ప్రత్యక్షం.. ఒక్కసారిగా పరుగులు తీసిన రైతులు

by Shiva |
పంట పొలాల్లో మొసలి ప్రత్యక్షం.. ఒక్కసారిగా పరుగులు తీసిన రైతులు
X

దిశ, నాగార్జునసాగర్: పంట పొలాల్లో ఓ భారీ మొస‌లి ప్రత్యక్షమైన ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని త్రిపురారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రోజులాగే ఇవాళ వ్యవసాయ పనుల్లోకి వెళ్లిన రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరిపొలంలోకి దిగిన రైతులు భారీ మొసలిని చూసి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ.. అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఉన్నట్టుండి వ్యవసాయ పొలంలో మొసలి కనిపించడంతో రైతులు పొలం పనుల్లోకి వెళ్లాలంటేనే జంకుటున్నారు. ఈ క్రమంలో మొసలిని చూసేందుకు గ్రామం నుంచే కాకుండా పక్క గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.



Next Story

Most Viewed