- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేరుకే కోర్టు.. నిండా సమస్యలు...!

దిశ, తుంగతుర్తి: నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి, ప్రధమ శ్రేణి న్యాయమూర్తి కోర్టులో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞాన సుందర్ ఉన్నత వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి, రిజిస్టర్ జనరల్, రిజిస్టర్ విజిలెన్స్ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తుంగతుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాదాపు 14 ఏళ్ల క్రితం తుంగతుర్తిలో ఏర్పాటైన కోర్టులో అనేక సమస్యలు తిష్టవేశాయని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ఏ జడ్జి కూడా సౌకర్యాలు లేవనే సాకుతో ఆరు మాసాల కంటే ఎక్కువ రోజులు పని చేయకుండానే బదిలీపై వెళ్తున్నారని తెలిపారు.
ఈ చర్యల వల్ల ప్రజలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా కేసులన్నీ పెండింగ్లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తుంగతుర్తి కోర్టు అంటేనే జడ్జి ఉండరనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని వివరించారు. ఇదిలా ఉంటే అద్దె భవనంలో కొనసాగుతున్న కోర్టుకు సొంత భవన నిర్మాణ నిమిత్తం ప్రభుత్వం రెండేళ్ల క్రితమే 199 సర్వే నెంబర్లు మూడు ఎకరాల 20 గుంటల భూమి కేటాయించిందని తెలిపారు. అద్దె భవనంలో క్యాంటీన్తో పాటు బాత్రూం, పార్కింగ్ తదితర సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. వెంటనే భవన నిర్మాణంతో పాటు రెగ్యులర్ జడ్జి,స్టెనో, ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిని నియమించాలని ఆయన వినతి పత్రంలో వివరించినట్లు తెలిపారు.