ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

by Naresh |
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
X

దిశ, కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో ఆఫీస్‌లో ఆర్‌ఐ కేశ్య తండా గ్రామానికి చెందదిన బానవత్ లచ్చు 1 ఎకరం భూమి పట్టా చేయుటకు రైతు వద్ద నుంచి రూ. 30 వేలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీనివాస్‌ను సంప్రదించగా గత నాలుగు రోజుల నుంచి రెక్కీ నిర్వహించారు. ఈ రోజు దేవరకొండలోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్‌లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గతంలో ఇతడి పై ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా ఈ రోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



Next Story

Most Viewed