- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అసలే ఇరుకు.. ఆపై ఆక్రమణ..

దిశ,నడిగూడెం: మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ పరిధిలోని రహదారులు రోజురోజుకు ఆక్రమణకు గురవతున్నాయి. దీంతో వాహనదారుల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిన మార్జిన్ ను సమీపంలోని కొందరు రైతులు తమ భూముల్లో కలుపుకుని సాగు చేపడుతున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మార్జిన్ ఆక్రమణకు గురి కావడంతో భారీ వాహనాలు ఎదురుగా వస్తే ఏటూ తప్పుకోలేక అవస్థలు పడుతున్నట్లు వారు వాపోతున్నారు.
నిత్యం వాహనాలతో రద్దీగా వుండే నడిగూడెం నుంచి కాగిత రామచంద్రాపురం, చాకిరాల ప్రధాన రహదారులతో పాటు, రత్నవరం, రామాపురం, సిరిపురం, వల్లాపురం, నారాయణపురం, వేణుగోపాల పురం, కరివిరాల నుంచి చెన్న కేశవాపురం రోడ్డు సైడ్ మార్జిన్ ఆక్రమణకు గురి కావడంతో కేవలం రోడ్డుపై ఒక వాహనం మాత్రమే వెళ్లే పరిస్థితి నెలకొంది. రహదారుల సమీపంలోనే ఆయా పంచాయతీ లు ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు పాసింగ్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఈ రహదారుల గుండా వేల మంది ప్రజలు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటారు. కాగిత రామచంద్రపురం నుంచి ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం కి వెళ్లే రహదారిలో రాత్రి సమయాల్లో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ఆక్రమణకు గురవుతున్న రోడ్లను పరిరక్షించిన పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.