- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అయోమయం గందరగోళం.. అంతా అస్పష్టత

దిశ,వలిగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామసభలు 3వ రోజు గందరగోళంగా మారింది. వలిగొండ, నాతాళ్ళగూడెం, సుంకిశాల, లింగరాజు పల్లి, జంగారెడ్డిపల్లి, రెడ్ల రేపాక,వర్కట్ పల్లి, మొగిలిపాక,వెంకటాపురం, నర్సాపురం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. వలిగొండ గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల జాబితా వినిపించగా.. అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల వాగ్వివాదంతో గ్రామసభ రసాభాసగా సాగాయి. కొన్ని గ్రామాల్లో వికలాంగ లబ్ధిదారుల పేర్లు కూడా రాకపోవడం గమనార్షమని ఆవేదన చెందారు. పోలీసులు శాంతించాలని ప్రజలకు సూచించిన ఆవేశంతో తిరుగుబాటు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సభను తమ ఆధీనంలోనికి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం సభ నిర్వహణ అధికారులు మాట్లాడుతూ..పేర్లు రానివారు మరల దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి నిరుపేద లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జగన్నాధ రావు చౌటుప్పల్ ఏసిపి పొట్టోళ్ల మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై యుగేందర్ గౌడ్ పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారు,లు ఆయా గ్రామాల ప్రజలు ఇతరులు పాల్గొన్నారు.