- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అమ్మ గూడెం సర్పంచ్ అక్రమాలపై ఎంపీడీవోకు ఫిర్యాదు

దిశ, కనగల్లు: కనగల్లు మండలంలోని అమ్మ గూడెం గ్రామం మాజీ సర్పంచ్ సింగం కోటేష్ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడని అమ్మ గూడెం గ్రామ ప్రజలు శుక్రవారం కనగల్లు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామ పంచాయతీకి చెందిన రెండు మోటర్లు, మూడు ఐరన్ పైపులు, సర్పంచ్ తన సొంత వ్యవసాయ బోర్లు వేసుకోవడం జరిగిందని 18 స్టార్టర్లు, 14 ప్యానల్ బాక్సులు, ఫీజుల సేట్లు, ఆటోమేటిక్ స్టార్టర్లు కొనుగోలు చేయకుండానే రూ. 60 వేల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగిందని అన్నారు. పలుగు బోర్డు పై ఫినిషింగ్ వేయకుండానే తీర్మానం లేకుండానే రూ. 1,70,000 మాజీ సర్పంచ్ తీసుకోవడం జరిగిందని అన్నారు. గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ను ట్రాక్టర్ తన సొంత కాంట్రాక్టు పనులు సిసి రోడ్డుకు వాడుకోవడం జరిగిందని మరియు జి పి ట్రాక్టర్ యొక్క సైడ్ బద్దేలు తీసుకొని తన సొంత టాక్టర్కు వేసుకోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీకి చెందిన 1 టేబుల్, 6 కుర్చీలను, తన సొంత ఇంటికి తీసుకువెళ్లాడని బోర్లు వేయకుండానే బోర్లు వేసినట్లు తీర్మానం చేసుకొని రూ. 1,40,000 సర్పంచ్ తీసుకోవడం జరిగిందని అన్నారు. ఎం. నరేష్ అనే అతన్ని ఎంపీడబ్ల్యుగా నియమిస్తూ అతని వద్ద నుంచి రూ. 20 వేల తీసుకోవడం జరిగిందన్నారు. టీఎస్బీపాస్ అకౌంట్ నుంచి ఎలాంటి బిల్లు లేకుండా రూ. 65 వేలు సర్పంచ్ తీసుకోవడం జరిగిందని అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండ ఏడుకొండలు, జానయ్య, పి.కోటేష్, జి. కోటేష్, నరసింహ, సైదులు, యాదగిరి, శ్రీరాములు, శ్రీనయ్య ,నారయ్య, తదితరులు పాల్గొన్నారు.