ప్రైవేటు పాఠశాల పై కలెక్టర్ కు ఫిర్యాదు..

by Sumithra |
ప్రైవేటు పాఠశాల పై కలెక్టర్ కు ఫిర్యాదు..
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

పాఠశాలలో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, షూస్, యూనిఫామ్ అమ్ముతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అనేక ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పాత బస్సులను తీసుకొచ్చి రంగులు వేసి ఫిట్నెస్ లేనప్పటికిని కొత్త బస్సులుగా నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల పై విచారణ జరిపి చర్యలు తీసుకొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంభయ్య మాదిగ, బీసీ యువజన సంఘం దామరచర్ల మండలం అధ్యక్షులు ఎర్ర మాద కుమార్, కంభంపాటి నాగరాజు, శ్రీకాంత్, బాబు, సైదరాజు తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed