పంటలు పండించేందుకు మురికి నీరే గతాయే..

by Sumithra |   ( Updated:2025-03-09 11:56:20.0  )
పంటలు పండించేందుకు మురికి నీరే గతాయే..
X

దిశ, రాజాపేట : రాజపేట మండలం రేణిగుంట గ్రామ రైతులు ప్రజలు అఖిలపక్ష నాయకులు ఆదివారం ఇసుక మాఫియా పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆగని అక్రమ ఇసుక రవాణా పై ఆగ్రహం వ్యక్తం చేసి అసహనం చెందారు. గత కొన్ని రోజులుగా 15 ఇసుక ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా జోరుగా చేస్తూ అదేమిటనే అడిగిన వారిని అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ దౌర్జన్యం చేస్తున్నారని, రెవెన్యూ పోలీసుల అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని వారు తెలిపారు. ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు ఇతర జిల్లాలకు అక్రమ ఇసుక రవాణా మాఫియాతో కొనసాగుతుందని ఆగ్రహించారు.

ముందుగా డప్పు చాటింపు చేయించి ప్రత్యేక సమావేశమైన గ్రామస్తులు నాయకులు రైతులు తమ గోడును, కష్ట నష్టాలను వివరించారు. సామూహికంగా లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా సాగుతూ ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయాయని వాగు పక్కన ఉన్న వ్యవసాయ బావులు కూడా నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు రైతులు చెప్పారు. గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఇలాంటి చర్యలు లేవని తమ బాధని వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు వలసలు తప్పవని తేల్చి చెప్పారు.



Next Story

Most Viewed