- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి.. ఈనెల 7న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

దిశ, నార్కట్పల్లి: అరకొర నీటి వసతితో ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఫ్లోరిన్ నీటిని తాగి జీవచ్చావాల్ల మారుతున్న ఈ ప్రాంత ప్రజలను చూసి చలించిపోయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2007 సంవత్సరంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును శంకుస్థాపన చేయించారు. ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు 100 గ్రామాలకు తాగునీటిని అందించాలన్నదే లక్ష్యం. 17 ఏళ్లుగా ప్రాజెక్టును పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తికి తాను అనునిత్యం పోరాడిన ఫలితం దక్కలేదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నెల ఏడో తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ ను నీటితో నింపారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు ఉదయించనుండడంతో ఈ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందాలు వెళ్లివిరుస్తున్నాయి.
ప్రాజెక్టు స్వరూపమిలా..
నల్లగొండ సమీపంలోని పానగల్ ప్రాంతంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఉన్న చెరువులోకి నీటిని పంపిస్తారు. అక్కడి నుంచి కుడి ఎడమల కాలువల ద్వారా నకిరేకల్ నల్లగొండ తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు 100 గ్రామాలకు తాగునీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు 699 కోట్ల రూపాయల అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు ఆకృతిని మార్చి అంచనాను సవరించి నిర్మించగా మిగిలిన నిధులను భూ సేకరణకు ఉపయోగించేలా ప్రణాళికలు చేశారు. దాదాపుగా 3851 ఎకరాల భూమి కుడి ఎడమ కాలువలకు అవసరం. ఇప్పటివరకు రెండు వేల ఎకరాల వరకు భూసేకరణ చేశారు. కొంతమేర కాలువలను సైతం నిర్మించారు. భూసేకరణ చేసిన భూమికి పరిహారాన్ని అందించారు. ప్రాజెక్టు ప్రారంభంతో ఈ కాలువల ద్వారా నీటిని చెరువుల్లోకి పంపించనున్నారు.
పట్టు వదలని విక్రమార్కుడిలా..
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలలో 2007 సంవత్సరంలో ప్రాజెక్టును శంకుస్థాపన చేయించారు. అప్పటి నుంచి తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు వెళ్లి ప్రస్తుతం మంత్రి హోదాలో మళ్లీ సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తన మనస పుత్రికగా చెప్పుకునే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యం పెట్టుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నీటితో రైతులకు లబ్ధి చేకూరనుంది.
గత పాలకుల నిర్లక్ష్యమే ఆలస్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ ప్రాంత ప్రజలకు నీటిని అందించాలని గొప్ప హృదయంతో మంత్రి వెంకటరెడ్డి ప్రాజెక్టును తీసుకువచ్చారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యమే ప్రాజెక్టు పూర్తి కాకుండా ఆలస్యం జరిగిందన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప వారు ఏమి చేయలేదన్నారు. సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించి ఈ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామన్నారు. అదేవిధంగా తాగునీటిని అందించడం ద్వారా ఫ్లోరిన్ నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషించే విషయం అన్నారు.