- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Surendra Mohan : స్వచ్చదనం.. పచ్చదనం కార్యక్రమంలో గనులు, భూగర్భ శాఖ సెక్రటరీ..

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పట్టణంలో గనులు, భూగర్భ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జిండాగేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో, విద్యార్థులతో భువనగిరి, యాదగిరిగుట్ట పట్టణాలలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మొక్కలు నాటడం మానవ కర్తవ్యమని అన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి తమ కర్తవ్యాన్ని తప్పకుండా నెరవేర్చాలని సూచించారు. మొక్కలను నాటి వాటిని పర్యవేక్షించినప్పుడే వాతావరణం ఆహ్లాదకరంగా మారి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి అన్ని వర్గాల ప్రజలు సమృద్ధిగా జీవనం సాగిస్తారని చెప్పారు. కాబట్టి ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, మున్సిపల్ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేష్, ఎరుకల సుధా హేమేందర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.