సీజే రాక పై అప్రమత్తంగా ఉండాలి

by Naresh |
సీజే రాక పై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, కోదాడ: కోదాడలో అదనపు కోర్టుల ప్రారంభోత్సవానికి, కోర్టు భవనం శంకుస్థాపనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరవుతున్నందున స్థానిక న్యాయమూర్తులు న్యాయవాదులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జడ్జి రాంగోపాల్ సూచించారు. శుక్రవారం కోదాడ కోర్టు ఆవరణలో శనివారం జరగబోయే శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల పై స్థానిక జడ్జిలతో బార్ అసోసియేషన్ సభ్యులతో సమీక్షించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు శ్యాంసుందర్, భవ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవ బత్తిని నాగార్జున ప్రధాన కార్యదర్శి సాధు శరత్ బాబు, కోశాధికారి పాషా, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed