- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చిట్యాలను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే వేముల

దిశ,చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం మున్సిపల్ కేంద్రంలో సిరి వెంచర్ నుండి సర్వీస్ రోడ్డు వెంట 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సమస్యలను పరిష్కరించి పట్టణ రూపురేఖలను మార్చే విధంగా కృషి చేస్తానన్నారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా పనిచేస్తుందన్నారు.
ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని, నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కమీషనర్ వీరేందర్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, జమాండ్ల జయమ్మ, జిట్ట పద్మ, జడల పూలమ్మ, మాజీ ఎంపీటీసీ ఎద్దుల పురి కృష్ణ, కుక్కల మోహన్, ఏళ్ల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.