- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలి

దిశ, నార్కట్ పల్లి ( చెర్వుగట్టు) : ప్రముఖ క్షేత్రం చెర్వుగట్టు ఆలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఉత్సవాల సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ విధంగా గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం భారీ కేడింగ్ తో క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేయాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకోవాలని, బ్రహ్మోత్సవాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు ట్రాన్స్ఫర్లను సిద్ధం చేయాలన్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వారిని మద్యాన్ని నియంత్రించాల్సిందిగా ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను సక్రమంగా నిర్వహించేందుకు రెవెన్యూ అదనపు కలెక్టర్ ను పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ ఆర్డిఓ బ్రహ్మోత్సవాల ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..ఏడాది బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు తాను ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తానని అన్నారు. గట్టు కింద దుకాణం దారులు రోడ్లపైకి రాకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్,నల్లగొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి ,ఇన్చార్జి డిఎస్పి జి రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ కే భాస్కర్, ఆలయ ఈవో నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ప్రముఖ క్షేత్రం చెర్వుగట్టు ఆలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు