తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం చలో నల్గొండ

by Sridhar Babu |
తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం చలో నల్గొండ
X

దిశ, కోదాడ : కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ రవీందర్​రావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 13న చలో నల్గొండకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి

హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వంలో చలో నల్గొండ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ బహిరంగ సభకు కోదాడ నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మన నీళ్ల కోసం మన హక్కుల కోసం మనందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో పోరాడుదాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , పార్టీ నాయకులు , గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని స్థాయిల పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed