- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేధింపులకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం.. ఎస్ఐ విజయ

దిశ, నల్లగొండ క్రైం : గృహిణులు, మహిళలు, యువతుల పై వేధింపులకు గురిచేసే ఆకతాయిల పై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని నల్లగొండ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ లో మహిళా దినోత్సవం సందర్భంగా దిశతో శుక్రవారం ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలంతా లింగ సమానత్వంతో ఉండాలని, మహిలళే కదా అని చిన్నచూపు చూసే వారి పై చట్టం కొరడా ఝులిపిస్తుందని అన్నారు. బాలిక దశ నుంచి ఉన్నతంగా చదివించాలని, సమాజం పట్ల అవగాహన ఉండేలా తల్లిదండ్రులు పెంచాలని సూచించారు. బాల్యవివాహాలు చేసేవారి పై కొత్తగా వచ్చిన చట్టాలు కఠినంగా వ్యవహరిస్తాయని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని కోరారు.
చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి, వాటికి బానిసలయ్యేలా చేయొద్దని, ఈ విషయం పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడి, డబ్బు పోగొట్టుకోవద్దని, నేరగాళ్ల వలలో పడితే మొదటి గంటలోనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేస్తే, అకౌంట్ ఫ్రీజ్ చేసి, అదే గోల్డెన్ అవర్ లో డబ్బును కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, పనిచేసే ప్రదేశాల్లో షీ టీం నిఘా ఉందని, ఒకవేళ వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100కు ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని ఆకతాయిల పై కొరడా ఝులిపిస్తారని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలంటే భయపడి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సవాల్ గా తీసుకుని రాయాలని విద్యార్థులు సూచించారు. వచ్చే వేసవిలో పిల్లలను కాల్వలకు, చెరువుల దగ్గరకు పోనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.