- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆవుల యజమానులపై కేసు నమోదు!
by Dishanational1 |
X
దిశ, మాడుగులపల్లి: మండలంలోని అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై ప్రయాణికులకు ఇబ్బందులు కలిగేలా ఆవులమందును తోలుకు వెళుతున్న యాజమానులపై స్థానిక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొత్తగూడెం సమీపంలో అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై సుమారు 600 ఆవులను తోలుకు వెళుతుండడంతో ప్రయాణికులకు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆవులమంద తోలుకువెళుతున్న యజమానులు కేతావత్ నరసింహ, రమావత్ శ్రీను, నేతల అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కైగురి నరేష్ తెలిపారు.
Next Story