- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రఘునాథపురం మండలం ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు..
by Aamani |

X
దిశ,రాజపేట: మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రస్తావించడం తో స్థానిక ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. సంవత్సరం పైగా పొట్టి మరి చౌరస్తాలో రఘునాథపురం చుట్టుపక్కల గ్రామస్తులు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని పైగా కేసులు నమోదు చేశారని గ్రామస్తులు నిరసన తెలిపారు. రఘునాథపురం, చల్లూరు, కంఠం గూడెం, సాదు వెళ్లి, చిన్న గౌరాయిపల్లి, పొట్టి మరి గ్రామాల ప్రజలు మండలం కోసం ఎదురుచూస్తున్నారు. రిలే దీక్షలలో పాల్గొని ఇచ్చిన హామీ మేరకు బీర్ల ఐలయ్య అసెంబ్లీలో ప్రస్తావించారని ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
Next Story