భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు... బీజేపీ ఎమ్మెల్యే హరీష్ కుమార్

by Naresh |
భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు... బీజేపీ ఎమ్మెల్యే హరీష్ కుమార్
X

దిశ, హాలియా: రాష్ట్రంలో పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉందని భవిష్యత్తు అంతా బీజేపీ దేనని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ కుమార్ తెలిపారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఒక విజన్ లేదని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా దేశ అభివృద్ధి పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విజన్ తో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలో 45 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని గత పది సంవత్సరాలుగా బిజెపి అవినీతి రహిత పాలన కొనసాగిస్తుందని వివరించారు. ప్రపంచ దేశాలు మోడీ అభివృద్ధి పట్ల ఆకర్షితులు అవుతున్నారని ప్రపంచం భారతదేశం వైపే చూస్తుందని తెలిపారు. దేశంలో రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తుందని ఎరువుల కొరతను తీర్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా మాదిగలను ఓట్లుగా వాడుకున్న పాలక ప్రభుత్వాలు వారి సమస్యలపై స్పందించలేకపోయారని ప్రధానమంత్రి మోడీ ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని తెలిపారు. దేశంలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధిక ఓట్ల శాతం సాధించి అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని దేశ భవిష్యత్తు కోసం మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు పూర్తి మద్దతు పలకాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంకణాల నివేదిత రెడ్డి జిల్లా నాయకులు నూకల నరసింహ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చలమల వెంకట్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి కొంపల్లి శ్రీనివాస్ యాదవ్ చెన్ను వెంకటనారాయణ రెడ్డి బండారు ప్రసాద్ మన్నెం రంజిత్ యాదవ్ గోలి మధుసూదన్ రెడ్డి సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఆయా మండల పార్టీల అధ్యక్షుడు పాల్గొన్నారు.



Next Story

Most Viewed