- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > BREAKING: మిర్యాలగూడ రైస్మిల్లులో ఘోర ప్రమాదం.. ఇద్దరు బిహార్ కూలీలు దుర్మరణం
BREAKING: మిర్యాలగూడ రైస్మిల్లులో ఘోర ప్రమాదం.. ఇద్దరు బిహార్ కూలీలు దుర్మరణం
by Shiva |

X
దిశ, వెబ్డెస్క్: మిర్యాలగూడ ఓ రైస్మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని భరణి రైస్మిల్లులో గోదాం గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన గంగాప్రసాద్ (45), రఘువీర్ (30) అనే కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు గోదాంలో బియ్యం బస్తాలను సర్దుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. తోటి కూలీల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story