BREAKING: మిర్యాలగూడ రైస్‌మిల్లులో ఘోర ప్రమాదం.. ఇద్దరు బిహార్ కూలీలు దుర్మరణం

by Shiva |
BREAKING: మిర్యాలగూడ రైస్‌మిల్లులో ఘోర ప్రమాదం.. ఇద్దరు బిహార్ కూలీలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మిర్యాలగూడ ఓ రైస్‌మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని భరణి రైస్‌మిల్లులో గోదాం గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన గంగాప్రసాద్ (45), రఘువీర్ (30) అనే కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు గోదాంలో బియ్యం బస్తాలను సర్దుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. తోటి కూలీల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story