- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మొదలైన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగవైభవంగా మొదలయ్యాయి. ప్రధానాలయం ముఖమండపంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వస్తివాచనం, రక్షాబంధన్, విశ్వక్సేన పూజలతో అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ప్రధానాలయంలోని స్వయంభూ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలతో ఉత్సవాల సందడి మొదలైంది. మొదటి రోజు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి లక్ష్మీ సమేత నారసింహుడికి రక్షాబంధనం గావించారు. గర్భగుడిలో ఉన్న స్వయంభూ లక్ష్మీనరసింహస్వామికి కంకణధారణ చేసి ముఖ మంటపం లోకి తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి, ఈవో భాస్కరరావు, డీఈవో దోర్బాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.