- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఎం చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభం..

దిశ, నార్కట్ పల్లి : బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం ,బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.
హెలిప్యాడ్ లో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మొదటగా పైలాన్ ప్రారంభించారు. అనంతరం రిజర్వాయర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు మోటార్ల ద్వారా నీటిని రిజర్వాయర్ లోకి వదలడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 35 నిమిషాల పాటు సాగిన సీఎం పర్యటనలో ఆయన పాటలతో ప్రాంతమంతా హోరెత్తింది. ప్రారంభానికి విచ్చేసిన సీఎంను మంత్రులను చూసేందుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చినప్పటికీ పోలీసుల ఆంక్షలతో ఎక్కడికి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.