రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక వచ్చిన బీజేపీదే గెలుపు: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Disha Web Desk 19 |
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక వచ్చిన బీజేపీదే గెలుపు: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, చండూరు: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చండూరు మండలం గట్టుప్పల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బై పోల్ ఎక్కడ వచ్చినా గెలిచేది బీజేపీ అని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. కార్యకర్తలు ఎప్పుడూ తప్పు చేయరన్నారు. రాజగోపాల్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం మానుకోకపోతే.. ఈ మునుగోడు ప్రాంత ప్రజలు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వస్తున్నాడని, నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని భావించి పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గత ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి 13000 ఓట్లు వచ్చాయని, ఈ సారి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఛానల్ చూసినా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని చెబుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వేదాంతం గోపినాధ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ భవానీ ప్రసాద్, బంగారిగడ్డ ఎంపీటీసీ పల్లె వెంకన్న, బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మాదగోని నరేందర్ గౌడ్, బీజేవైయం నియోజకవర్గ కన్వీనర్ పులకరం సైదులు, బీజేపీ మండల పార్టీ ఉపాద్యక్షులు పోలే రాజు, నకర కంటి లింగస్వామి, పులకరం బాలకృష్ణ తదితరులు పాల్లొన్నారు.


Next Story

Most Viewed