- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూడు స్థానాల్లో బీజేపీదే గెలుపు : కేంద్ర మంత్రి

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : మూడు ఎమ్మెల్సీ స్థానాలలో బీజీపీ పోటీ చేస్తుందని,ఈ మూడు స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ,ఖమ్మం , నల్లగొండ ఉపాధ్యాయుల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. సుమారు 80 నియోజక వర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఉపాధ్యాయ జెఎసి లో పని చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని, గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉపాధ్యాయ వర్గాలకు తాము అండగా ఉన్నామన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చెయ్యడానికి భయపడుతున్నారన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేసే పరిస్థితి లేదని,ఖాళీల భర్తీ కి కరపత్రాలు పంచినా, అమలు కాలేదన్నారు. మూడు డిఏ లు ఉపాధ్యాయులకు ఇవ్వలేదని ఐదు కరువు భత్యాలు బాకి పడిందన్నారు. కేంద్రం బడ్జెట్ లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, మధ్య తరగతి వారికి 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చారన్నారు. శాసన మండలి బిజెపి అభ్యర్థులను గెలుపుకు ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. పులి సరోత్తం రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.