- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
by Sumithra |

X
దిశ, చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రి గూడెం గ్రామ శివారు వద్ద ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. కోదాడ నుంచి చింత్రియాల వెళ్ళుటకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు శోభనాద్రి గూడెం వెళ్లే మూల టర్నింగ్ వద్ద రైతులు పంట పొలాలకు నల్ల మట్టి తోలుతున్న క్రమంలో ఆ నల్ల మట్టి రోడ్డుపై పడి నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సింగిల్ రోడ్డు కావడంతో మూలమలుపు వద్ద రోడ్డుపై మట్టి పేరుకుపోయింది. దీంతో ఆర్టీసీ బస్సు చింత్రియాల వెళ్తుండగా బస్సు టైర్ ఒకేసారి జారీ రోడ్డుకు అడ్డంగా తిరిగింది. బస్ డ్రైవర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగనందున డ్రైవర్ చేసిన పనికి స్థానిక ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story