- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

దిశ, హాలియా : ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల వైద్య సేవల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బుధవారం హాలియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిరుపేదలకు అందుతున్న వైద్య సేవలపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోజువారి ఓపి, సేవలు ల్యాబ్, ఫార్మసీ ఉద్యోగుల పనితీరు తదితర అంశాలపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు పని చేస్తుందని ఈ కేంద్రంలో కొంత సిబ్బంది కొరత ఉందని తాత్కాలికంగా వాటి సమస్యను అధిగమించేందుకు ఆరోగ్య కేంద్రంలో ఉన్న సూపర్వైజర్ డిప్యూటేషన్ రద్దు పరిచి ఇక్కడే డ్యూటీ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందాలని ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించబడుతున్నాయని పేర్కొన్నారు.
చిన్నచిన్న సమస్యలకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడం ద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్, ఓపి, ఫార్మసీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సీరం కలెక్షన్ సెంటర్ ను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటల ఆరోగ్య కేంద్రం అయినప్పటికీ ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉండడం గతంలో ప్రభుత్వ జీవోలో పేర్కొనడం ద్వారా ఒకరు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ విషయాలపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి మరో వైద్యున్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తహసీల్దార్ రఘు వైద్యాధికారి రామకృష్ణ ఆర్ఐ నవీన్ తదితరులు ఉన్నారు.