సైబర్ నేరాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

by Naveena |
సైబర్ నేరాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ,వలిగొండ: సోషల్ మీడియాలో ఉపాధి కల్పిస్తామని వచ్చే పోస్టులను నమ్మవద్దని ఎస్సై యుగేందర్ గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో..విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి నిండు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చెడు వ్యసనాలకు బానిసలై కనిపెంచిన తల్లి తండ్రులకు దుఃఖన్ని మిగిల్చ వద్దని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం తెలిపిన, మీరు చూసిన వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి..డ్రగ్స్ రహిత సమాజం కోసం సహకరించాలని సూచించారు. అదేవిధంగా సిగరెట్స్, గుట్కా, మద్యాo అలవాటు చేసుకోకుండా, చదువుపై శ్రద్ధ వహించి.. ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదని, ముఖ్యంగా హెల్మెట్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని అన్నారు.



Next Story

Most Viewed