చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి..

by Kalyani |
చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి..
X

దిశ , సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ వద్ద లారీ,ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదారాబాద్ లో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ కంపసాటి మహేష్ (30)శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.ఈ ప్రమాద ఘటనలో నాడు ఓ చిన్నారి, ఉపాధ్యాయురాలు, మరో వృదురాలితో కలిసి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో చిన్నారి, ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా ఆ ఆటో డ్రైవర్ మృతితో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నేటితో ఆరు కి చేరింది. మృతుడు సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.



Next Story