దారుణం.. మద్యం మత్తులో కన్నతల్లినే..

by Sathputhe Rajesh |
దారుణం.. మద్యం మత్తులో కన్నతల్లినే..
X

దిశ, కోదాడ : తాగిన మైకంలో కన్నతల్లిని కుమారుడు కడతేర్చిన సంఘటన అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తమ్మరబండ పాలెం సుందరయ్య నగర్ కు చెందిన పుట్ట బంతి రాములమ్మ ( 70) గత రెండు సంవత్సరాల క్రితం తన కుమారుడు పుట్ట బంతి వీరేష్‌తో కలిసి గరిడేపల్లి మండలం సర్వారం గ్రామము నుండి వలస వచ్చి తమరబండపాలెంలో జీవనం కొనసాగిస్తున్నారు.

వీరేషు తాపీ పని చేస్తున్నాడు. కానీ నిత్యం మధ్యనికి బానిసై తల్లిని చిత్రహింసలకు గురి చేసేవాడు. బుధవారం సైతం తాగిన మైకంలో తాగొద్దని వారిచ్చిన తల్లిని గొంతు నులిమి చంపాడు. విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్సై అనిల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు వీరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed