- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేయాలి

దిశ ,మిర్యాలగూడ టౌన్ : లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దాసరి చందన అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని, ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈ విషయాల్లో అధికారులు జాగ్రత్త వహించాలని కోరారు. గతంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాస్ రావు, డీఎస్పీ రాజశేఖర్ రాజు, తహసీల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.