- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

దిశ ,నార్కట్ పల్లి :నార్కట్ పల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం రేపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి 7న బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.అందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి..ఆంక్షలు విధిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో పట్టుదలతో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. అదేవిధంగా ప్రస్తుతం సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు..అప్పటి సీఎం ఇప్పటి సీఎం ఇద్దరిని తమ స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలకు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తి చేసి మాకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.