నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం..

by Sumithra |   ( Updated:2024-06-24 16:43:28.0  )
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం..
X

దిశ, నేరేడుచర్ల : నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పాలకవీడు మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన గుండ్ల పహాడ్ మాజీ ఎంపీటీసీ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావును నియమించారు. అలాగే వైస్ చైర్మన్ గా నేరేడుచర్ల పట్టణానికి చెందిన తాళ్ల సురేష్ రెడ్డితో పాటు 16 మంది డైరెక్టర్లు 2 సంవత్సరాల కాలపరిమితితో నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారితో పాటు 16 మంది డైరెక్టర్లుగా కొడాలి పాపయ్య, ఎల్లంచెరువు బాల్ రెడ్డి, షేక్ బాల సైదా, నల్లమల్ల రాకేష్, మచ్చ శ్రీను, అన్ని రెడ్డి మధుసూదన్ రెడ్డి, అందే రామకృష్ణ, పగిడిపాటి సైదిరెడ్డి, బానోత్ శ్రీను, దండ సంజీవరెడ్డి, పోలిశెట్టి వినయ్ కుమార్, గుమ్మడవెల్లి సోమయ్య, చిల్లేపల్లి పీఎసీఎస్ చైర్మన్, డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ సూర్యాపేట, అగ్రికల్చర్ ఏడిఏ హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ డైరెక్టర్ గా నియమిస్తూ జీవోలో పేర్కొన్నారు.



Next Story