ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి..

by Kalyani |
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి..
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాల బాలికలకు 2025 వ సంవత్సరంలో అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు ఆగస్టు 31, 2024 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ. కే. నరసింహారావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల & వయోవృద్ధుల శాఖ, సూర్యాపేట ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కు గాను మెడల్, సర్టిఫికెట్ ఇతర గిఫ్ట్ లు ఉంటుందని, ఈ అవార్డుల కోసం 05 నుంచి 18 ఏళ్లలో గా ఉన్నవారు అర్హులని, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, ధైర్య సాహసాలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కళలు వంటి సేవ రంగాలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. ఆన్ లైన్ లో National Awards Portal (https://awards.gov.in/) దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత ప్రతిని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ, కలెక్టరేట్, సూర్యాపేట కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.



Next Story

Most Viewed