- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొత్త రేషన్కార్డుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్

దిశ,సంస్థాన్ నారాయణపురం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరు గ్రామసభలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న రేషన్ కార్డు సర్వేలలో తమ పేరు లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలనే లక్ష్యంతోనే సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కోతలాపురం గ్రామంలో రైతు భరోసా సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు భరోసా సర్వే చేపడుతున్న అధికారుల నుండి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా సర్వే పకడ్బందీగా చేపట్టాలని కొండలు,గుట్టలను గుర్తించి వాటి విస్తీర్ణాన్ని నమోదు చేసి..అనర్హులకు లబ్ధి చేకూరకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేసే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. సర్వే పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 21 నుండి గ్రామసభలను ఏర్పాటు చేసి,లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తామని ఆయన విలేకరులకు తెలిపారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డీవో వి.శేఖర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ బి జయశ్రీ,తహసిల్దార్ ఎం కృష్ణ, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎంపీఓ నరసింహారావు, ఆర్ఐ పాండు తదితరులున్నారు.