- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏపీఎల్, బీపీఎల్ కార్డులు ఇవ్వాలి.. శాసన మండలి చైర్మన్..

దిశ, నల్లగొండ : తెలంగాణా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో లక్షకు పైగా ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు. ఓటర్ల జాబితాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు, సర్వేలో తక్కువ మందిని చూపిస్తున్నారు అని అన్నారు. కానీ కొందరు చాలా చోట్ల రెండు నుండి మూడు ఓట్లు కలిగి ఉన్నారు. దొంగ ఓటర్లను తొలగించాలి అన్నారు. సర్వే చేసిన వారు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని అన్నారు.
2014 లో సమగ్ర సర్వే చేసిన డేటా మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ లో ఉంది కాని ఆ సమగ్ర కుటుంబ సర్వేని అధికారికంగా బహిర్గత పరచలేదు అన్నారు. ఎవరైనా ఇంత వరకు సర్వేలో పాల్గొనని వారు వారి వివరాలు ఇవ్వాలి అని కోరారన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేయడం సబబు కాదు అన్నారు. రాజకీయ నేతల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిపోతుంది అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీఏల్, బీపీల్ రేషన్ కార్డులు ఉండేవి అన్నారు. గతంలో ప్రభుత్వం కొత్త కార్డుల ప్రక్రియ చేపట్టలేదు అన్నారు. ఏపీఎల్, బీపీఎల్ కార్డుల విధానం ప్రవేశ పెట్టాలన్నారు. పేదరికంలో ఉన్న వారు వైట్ కార్డు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా రైతులకు అందివ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. పంటల అధిక ఉత్పత్తికి కారణం రైతు భరోసా ఇవ్వాలి అన్నారు. ప్రభుత్వ పరమైన ఏదైనా పథకం నిలిపివేసి అయినా రైతు భరోసా ఇవ్వాలి అని అన్నారు. మదర్ డైరీ ఆస్తులను అమ్మవద్దు అని ప్రత్యామ్నాయం చూసుకోవాలి అని అన్నారు. వ్యవస్థలో సంస్థ సమగ్రంగా ఉండాలంటే కాపాడుకోవాలి అన్నారు.