కుమ్మరి కుంటలో పడి వృద్ధురాలు మృతి

by Naveena |
కుమ్మరి కుంటలో పడి వృద్ధురాలు మృతి
X

దిశ, రమన్నపేట : కుమ్మరి కుంటలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన రామన్నపేట మండలం తుమ్మల గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పి మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం..నిధాన్ పల్లి గ్రామానికి చెందిన గోపగోని భారతమ్మ (70) తుమ్మలగూడెం గ్రామ శివారులోని కుమ్మరి కుంటలో పడి చనిపోయింది. దీంతో గమనించిన తుమ్మలగూడెం గ్రామానికి చెందిన మందడి గోపాల్ రెడ్డి సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో మృదురాలిని కుంటలో నుంచి బయటకు తీసి మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతురాలి కుమార్తె బత్తిని కలమ్మ ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed