అంబేద్కర్​ అడుగుజాడల్లో ముందుకు : ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

by Disha Web Desk 15 |
అంబేద్కర్​ అడుగుజాడల్లో ముందుకు : ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
X

దిశ, నల్లగొండ : అంబేద్కర్​ అడుగుజాడల్లో తెలంగాణ ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఎస్సీ వెల్పేర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అందరికీ విద్యను అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గురుకుల విద్యార్థిపై దాదాపు రూ. లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. వచ్చే అంబేద్కర్ జయంతి వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , బాబు జగ్జీవన్ రామ్ , సర్వాయి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, ఎంపీపీ సురేష్, జెడ్పీటీసీ సభ్యులు వంగూరి లక్ష్మయ్య, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు కత్తుల మహేష్, టీఎన్జీవో అధ్యక్షులు శ్రవణ్ ,ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ గొల్లపూడి జైపాల్, కత్తులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed