ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అంబేద్కర్ కు అవమానం..

by Sumithra |
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అంబేద్కర్ కు అవమానం..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటం లేకుండానే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ చిత్రపటం లేకపోవడం పై బీఆర్ఎస్, బీజేపీ, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా మరోవైపు కింద పడిపోయే దశలో జాతీయ జెండా దర్శనం ఇచ్చింది.

ఒకవైపు తాడు తెగిపోవడంతో జాతీయ జెండా కింద పడిపోయే క్రమంలో ఒక పాఠశాల విద్యార్థిని జెండాను సవరించి కట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహానీయుడు అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణలో నిబంధనలు సక్రమంగా పాటించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనగాం పాండు, రత్నపురం బలరాం, సుర్పంగ శివలింగం, ఇటుకల దేవేందర్, బర్రె సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed